Loksabha Elections 2024 : బీజేపీ లక్ష్యంగా బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. తేజస్వి యాదవ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో మహాకూటమి ప్రభుత్వం కులగణన అనంతరం బీసీలు, దళితులు, ఆదివాసీల రిజర్వేషన్ పరిమితిని 75 శాతానికి పెంచిందని గుర్తుచేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయం ఎందుకు ప్రస్తావించరని ఆయన ప్రశ్నించారు. కాషాయ పాలకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయం ప్రజలకు అర్ధమైందని అన్నారు. బిహార్ నుంచి బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. విపక్ష ఇండియా కూటమి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :
Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డి చాతకాని వెధవ.. మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం