Motkupalli Narasimhulu | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చాతకాని వెధవ అంటూ దుయ్యబట్టారు. ఆయన రెడ్డి దొర.. పొట్టి దొర అని విమర్శించారు.
అరేయ్ పొట్టి దొర.. నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా..? మోత్కుపల్లి నర్సింహులు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిండు.. అది అర్థం చేసుకోవాలి. మోత్కుపల్లి ఆరు సార్లు గెలిచిండు. నువ్వు ఏదో పీకుడుగానిలా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా..? దుర్మార్గుడా.. నువ్వు మొగోనివా..? కులాల ప్రతిపాదికన సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడు ఆ మొనగాడు. నువ్వు ఎన్ని రోజులు ఉంటవ్ సీఎంగా.. నా మాదిగ బిడ్డలు నీకు కర్రుకాల్చి వాత పెడుతారు.. గుర్తుంచుకో. ఎవడ్రా నువ్వు. మా జాతిని తొక్కేసే కుట్ర చేస్తున్నావ్. ఏబీసీడీ వర్గీకరణ గురించి పార్లమెంట్లో మాట్లాడకుండా కుట్ర చేస్తున్నవ్. 80 లక్షలున్న నా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా, పట్టుమని 10 మంది ఉన్న వేరే కులాలకు టికెట్ ఇస్తావా రేవంత్ రెడ్డి . ఏ రకంగా ఇది సమన్యాయం. ఏ రకంగా సమర్థించుకుంటవ్. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తడు. కానీ చేసేది మాత్రం శూన్యం. రేవంత్ రెడ్డి చాతకాని వెధవ అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి దొర.. పొట్టి దొర
అరేయ్ పొట్టి దొర నన్ను బెదిరిస్తావా.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను బెదిరిస్తావారా – కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు pic.twitter.com/fvrKXD9Qul
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2024