Rakesh Reddy | హైదరాబాద్ : నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో రాకేశ్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు.
మంగళవారం నాడు నల్లగొండ జిల్లా కలెక్టర్లో నామినేషన్ దాఖలు చేస్తానని, భారీ ఎత్తున పట్టభద్రులు ర్యాలీలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతునై నేను వస్తున్నా – మీ గొంతునై నేను ప్రశ్నిస్తా అని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతునై నేను వస్తున్నా – మీ గొంతునై నేను ప్రశ్నిస్తా.
ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రేపు నేను వేయబోయే నామినేషన్ ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరు.… pic.twitter.com/s82LMzRJJq
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) May 6, 2024