Karnataka | ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్ (Congress) శ్రేణులు శుభ్రం చేశారు. గో మూత్రం, పేడ (cow dung)తో ఆ రహదారిని క్లీన్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 30వ తేదీన మైసూర్ (Mysore)లో మోదీ భారీ రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. మైసూర్ కేఆర్ సర్కిల్ (Mysore KR circle) నుంచి హైవే సర్కిల్ వరకు ఈ రోడ్ షో సాగింది. అయితే మోదీ రోడ్ షో కారణంగా ఆ మార్గం అపవిత్రమైందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. ఈ మేరకు ఆ రహదారిని ఆవు మూత్రం, పేడతో శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘రాజమార్గంలో మోదీ రోడ్ షో నిర్వహించడం చాలా పెద్ద తప్పు. ఇది మైసూర్ రాజకుటుంబాన్ని అవమానించడమే అవుతుంది. ఈ ఘటనతో మేం చాలా బాధపడ్డాం. దసరా సందర్భంగా అంబారీ ఊరేగింపు తప్ప మరే ఇతర ఊరేగింపులు ఇక్కడ జరగలేదు. హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ నేతలు ఈ మార్గంలో రోడ్ షో నిర్వహించి రాజమార్గాన్ని అపవిత్రం చేశారు. పవిత్ర మార్గాన్ని మోదీ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించారు. అందువల్లే రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయింది’ అని అన్నారు. అయితే క్లీనింగ్ పనులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Also Read..