Mary Kom | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) హింసాత్మకంగా (Violence) మారింది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. గిరిజన గ్రూపులు చేస్తున్న ఆందోళన వల్ల 8 జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్టీ హోదా గురించి ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడాన్ని నిరసిస్తూ గిరిజనలు నిరసనలు చేపట్టారు. నిన్న రాత్రి ఇంపాల్ (Imphal) , చురాచంద్పూర్, కంగ్పోక్కి ప్రాంతాల్లో హింస(Violence) చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలపై బాక్సర్ (Boxer), రాజ్యసభ మాజీ సభ్యురాలు మేరీ కోమ్ (Mary Kom) స్పందించారు. ‘నా రాష్ట్రం మణిపూర్ మండిపోతోంది. దయచేసి సాయం చేయండి’ అంటూ ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని కోరారు (Centre For Help). ఈ మేరకు మణిపూర్లో హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు.
My state Manipur is burning, kindly help @narendramodi @PMOIndia @AmitShah @rajnathsingh @republic @ndtv @IndiaToday pic.twitter.com/VMdmYMoKqP
— M C Mary Kom OLY (@MangteC) May 3, 2023
అనంతరం ఏఎన్ఐతో మేరీ కోమ్ మాట్లాడుతూ.. ‘మణిపూర్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిన్న రాత్రి నుంచి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ హింసలో కొందరు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం దురదృష్టకరం. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులు వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
#WATCH | Delhi: I am not feeling good about the situation In Manipur. Since last night the situation has deteriorated. I appeal State & Central Government to take steps for the situation & maintain peace & security in the state. It is unfortunate that some people lost their… pic.twitter.com/y1ht24WiSc
— ANI (@ANI) May 4, 2023
మైటిస్ (Meitei) వర్గానికి గిరిజన హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మణిపూర్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఏటీఎస్యూఎం ఆధ్వర్యంలో గిరిజన సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మైటిస్ వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడాన్ని ఆ సంఘం వ్యతిరేకిస్తోంది. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని మైటిస్ వర్గం ఇటీవల ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసింది. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో.. గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఈ గొడవతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతోంది. పరిస్థితుల్ని అదపులోకి తెచ్చేందుకు ఆర్మీని రంగంలోకి దింపారు. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ దళాలు హింసాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. ఆర్మీ క్యాంపుల్లో దాదాపు 7500 మందికి ఆశ్రయం కల్పించారు. మరోవైపు శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందకు రాష్ట్ర ప్రభుత్వం అనేక జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
Also Read..
Manipur Violence: మణిపూర్లో భారీ హింస.. రంగంలోకి దిగిన ఆర్మీ
Army chopper | జమ్మూ కశ్మీర్లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
Delhi Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. మే నెలలో 13 ఏండ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు