ముంబై: భర్త వేధింపులతో ఢిల్లీకి చెందిన ఓ మహిళ విసిగిపోయింది. అతనితో కలిసి ఉండటం కష్టమని భావించింది. అందుకే 11 ఏండ్ల కూతురును తీసుకుని ఢిల్లీ నుంచి ముంబైలో బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. దాంతో భార్య జాడ కోసం వెతికిన భర్త చివరికి ఆమె ఆచూకీ కనిపెట్టాడు. కానీ అతనితో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఆగ్రహానికి లోనైన భర్త ఆమె ముక్కు కొరికేశాడు. ఈ నెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన విజేందర్ పాల్ (36), ప్రేరణ సైనీ (31) భార్యాభర్తలు. వారికి 11 ఏండ్లు కూతురు ఉన్నది. అయితే, ఇటీవల దంపతులిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని విజేందర్ అనుమానం పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. రోజురోజుకు భర్త వేధింపులు పెరిగిపోవడంతో ప్రేరణ విసిగిపోయింది. అందుకే కూతురును వెంటబెట్టుకుని భర్తకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ముంబైలోని బంధువుల ఇంటికి వెళ్లిన ప్రేరణను వెతుక్కుంటూ బయల్దేరిన విజేందర్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్దాం రమ్మని భార్యను కోరాడు. కానీ అతనితో వెళ్లేందుకు ఆమె ఒప్పుకోలేదు. బంధువుల ముందు కూడా భార్య తన మాట వినకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. అందుకే ఆ ఇంటి దగ్గరే మాటువేసిన విజేందర్ పాల ప్యాకెట్ కోసం భార్య బయటికి రాగానే ఆమెను అనుసరించాడు. దాంతో ఆమె ఆటో ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అదే ఆటోను వెంబడించి ఎక్కిన విజేందర్ భార్య ముక్కు కొరికేసి పారిపోయాడు.
బలంగా కొరకడంతో ప్రేరణ ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు 15 కుట్లు వేశారు. ఇదిలావుంటే భార్య ముక్కు కొరికి పారిపోతున్న విజేందర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా తనకు తన భార్య, పాప అంటే చాలా ఇష్టమని, వారిని విడిచి ఉండలేనని విజేందర్ చెప్పాడు. తాను కూతురు, భార్యతోనే తిరితి ఢిల్లీకి వెళ్తానని, రమ్మని ఎంత బతిమాలినా వినకపోవడంతోనే క్షణికావేశంలో ముక్కు కొరికానని తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా రాదంటూ కరిగించిన వెండి తాగింది.. కానీ కాటికి పోయింది..!
కరోనా ఎఫెక్ట్: తోపుడు బండిపై తల్లి అంతిమ యాత్ర..!
కరోనా పాజిటివ్గా తేలిన గంటల్లోనే యువ డాక్టర్ మృతి..!
నీరవ్ మోదీ అప్పగింత మరింత ఆలస్యం..!
నేపాల్లో 26 మంది ఎంపీలకు కరోనా..!
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్