జైపూర్: రాజస్థాన్లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. మాతృదినోత్సవం నాడే ఓ తల్లికి అవమానకర రీతిలో అంతిమ యాత్ర నిర్వహించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని ఝహల్వార్ పట్టణంలో ఇటీవల ఓ మహిళ కరోనా వైరస్ సోకి మృతిచెందింది. అయతే, ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అధికారులు నిరాకరించారు. కనీసం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అయినా సమకూర్చాలని వేడుకున్నా పట్టించుకోలేదు.
మరోవైపు గ్రామస్తులు కూడా ఆ కుటుంబానికి సహకరించలేదు. దాంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మృతురాలి ఇద్దరు కొడుకులు ఓ తోపుడు బండిపై తల్లి శవాన్ని పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. దాదాపు ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి తోపుడు బండిపైనే తల్లి మృతదేహాన్ని తరలించారు. ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి సరిపోయిందని, లేదంటే పరిస్థితి ఏమిటని ఈ విషయం తెలిసిన మానవతావాదులు ప్రశ్న లేవనెత్తుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా పాజిటివ్గా తేలిన గంటల్లోనే యువ డాక్టర్ మృతి..!
నీరవ్ మోదీ అప్పగింత మరింత ఆలస్యం..!
నేపాల్లో 26 మంది ఎంపీలకు కరోనా..!
మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్