CEO Kidnapped | ముంబై (Mumbai)లో పట్టపగలే ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవో (Music Company CEO) కిడ్నాప్ కలకలం రేపింది. 10 నుంచి 15 మంది వ్యక్తులు ఆఫీసులోకి చొరబడి తుపాకీ గురి పెట్టి సీఈవోను బలవంతంగా తీసుకెళ్లారు. అయితే, పోలీసులు వెంటనే ఛేజ్ చేసి బాధితుడిని రక్షించారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబై శివారులోని గోరెగావ్ (Goregaon) ప్రాంతంలో గల చింతామణి క్లాసిక్ కాంప్లెక్స్ (Chintamani Classique complex) లో ఉన్న మ్యూజిక్ కంపెనీ సీఈవో రాజ్ కుమార్ సింగ్ (Raj Kumar Singh)కు.. నగరంలోని ఆది శక్తి ప్రైవేట్ లిమిటెడ్ మ్యూజిక్ కంపెనీ (Adi Shakti Private Limited music company)ని నడుపుతున్న మనోజ్ మిశ్రా (Manoj Mishra)తో కొంతకాలంగా ఆర్థిక వివాదం కొనసాగుతోంది. మనోజ్ మిశ్రాకు చెందిన ఆదిశక్తి ఫిల్మ్స్ కు రాజ్ కుమార్ రూ.8 కోట్లు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని మనోజ్ మిశ్రాను రాజ్ కుమార్ గత కొంతకాలంగా కోరుతున్నాడు. అయితే, అందుకు మనోజ్ ఒప్పుకోకపోగా.. షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే (Shinde Camp MLA) ప్రకాశ్ సుర్వే (Prakash Surve) అండతో బెదిరింపులకు పాల్పడటం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం రాజ్ కుమార్ కు ఫోన్ చేసి ఎమ్మెల్యే సుర్వే ఆఫీసుకు రావాలని బెదిరించారు. అయితే, ఇప్పుడు కుదరదని, శనివారం వస్తానని చెప్పి రాజ్ కుమార్ ఫోన్ పెట్టేశాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే రెండు కార్లల్లో సుమారు 10 నుంచి 15 మంది వ్యక్తులు రాజ్ కుమార్ ఆఫీసులోకి వెళ్లారు. తుపాకీతో రాజ్ కుమార్ను బెదిరించి బలవంతంగా అక్కడినుంచి కారులో తీసుకెళ్లిపోయారు. ఆఫీసులో పనిచేసే వ్యక్తి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కారు నంబర్ ఆధారంగా నిందితుల కార్లను గుర్తించి రాజ్ కుమార్ను సేవ్ చేశారు. తనను కిడ్నాప్ చేసిన దుండగులు ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లినట్లు రాజ్ కుమార్ పోలీసులకు తెలిపారు. అక్కడ ఎమ్మెల్యే కుమారుడు రాజ్ సుర్వే (Raj Surve) తనను గన్ తో బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు పోలీసులు రాజ్ సుర్వే, మనోజ్ మిశ్రా సహా మరో 10 మందిపై కేసు నమోదు చేశారు.
Also Read..
New Covid Variant | అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కలకలం
Mega Millions jackpot | లక్ అంటే ఇది.. లాటరీలో ఏకంగా రూ.13వేల కోట్ల జాక్పాట్..!
No-Confidence Motion | అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో నేడు సమాధానం ఇవ్వనున్న మోదీ