Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబం గణనాథుడి సేవలో తరించిపోయింది. గణపతి నవరాత్రుల సందర్భంగా భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, కుమార్తె ఈశాతో కలిసి ముకేశ్ అంబానీ ముంబై (Mumbai)లోని సిద్ధివినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. గణనాథుడికి లడ్డూను నైవేద్యంగా సమర్పించారు.
ఈ సందర్భంగా ఈశా కవల పిల్లలను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అదేవిధంగా అంబానీ కుటుంబ సభ్యులకు ఆలయ పూజారులు శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అంబానీ రాకతో ఆలయంలో కాసేపు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Reliance Industries chairman Mukesh Ambani and his wife Nita Ambani along with their family offer prayers at Siddhivinayak Temple in Mumbai pic.twitter.com/YGchR5Qp3u
— ANI (@ANI) September 24, 2023
Also Read..
Parineeti-Raghav Chadha | వివాహబంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. పిక్స్ వైరల్
Tirumala | మహారథంపై ఊరేగిన శ్రీదేశిభూదేవి సమేత మలయప్ప స్వామి