Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మారుమ్రోగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం మహారథంపై కొలువుదీరి శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో ఉప్పొంగి పోతున్నారు. కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రాత్రి 7 గంటలకు అశ్వ వాహనంపై స్వామివారు విహరించనున్నారు.