ఈ పథకంతో నియోజకవర్గంలో 100 మందికి లబ్ధి
ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
భద్రాచలం, దుమ్ముగూడెం, పర్ణశాలలో పల్లె ప్రగతి పనులు ప్రారంభం
భద్రాచలం, జూలై 2 : దళితుల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శుక్రవారం ‘పల్లె ప్రగతి’లో భాగంగా భద్రాచలం, దుమ్ముగూడెం, పర్ణశాలలో మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత ఆయన బీఆర్ అంబేడ్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం భద్రాచలం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన ‘దళిత సాధికారత’ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్ధాలు గడిచినా.. నేటికీ దళితులు అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల్లో పేదరికాన్ని పోగొట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళిత సాధికారత’ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. రూ.వెయ్యికోట్లు కేటాయించి, నియోజకవర్గంలో 100 మందికి, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మంలో తాను ‘గుండె దరువు’ అనే కార్యక్రమాన్ని డప్పు కొడుతూ నిర్వహించానని తెలిపారు. 33 జిల్లాల్లో అత్యధిక దళితులున్న జిల్లాలు నల్గొండ, ఖమ్మం అని, దళితులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఎక్కువ మంది దళితులుంటే వారికి న్యాయం జరిగేలా చూడాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. పైరవీలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకే పథకం ఫలాలు అందుతాయన్నారు. అనంతరం దళిత సాధికారతలో భాగంగా నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో ఆయన అన్నం వడ్డించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ప్రభుత్వవిప్ రేగా కాంతారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మండల కార్యదర్శి తిరుపతి, ఏజీపీ శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు శేఖర్, పిచ్చయ్య, పౌల్రాజ్, బాలయోగి పాల్గొన్నారు.
వైకుంఠధామం, డంపింగ్యార్డులు ప్రారంభం
దుమ్ముగూడెం, జూలై 2 : దుమ్ముగూడెం మండలపరిధిలోని తూరుబాక గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్ కోరం కనకయ్యతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వైకుంఠధామం ఆవరణలో మొక్కలు నాటారు. డంపింగ్యార్డులో వర్మీకం పోస్టు విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణమూర్తి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బత్తుల శోభన్, సర్పంచ్ చందు, మండల ప్రత్యేకాధికారి చంద్రప్రకాశ్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో చంద్రమౌళి పాల్గొన్నారు.
చిన్నబండిరేవులో ప్రకృతి వనం ప్రారంభించిన మంత్రి, ఎంపీ
పర్ణశాల, జూలై 2 : చిన్నబండిరేవు గ్రామంలో శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావుతో కలిసి పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. పర్ణశాల పీహెచ్సీ సమీపంలో రోడ్డుపక్కన శ్రమదానం చేసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం చిన్నబండిరేవు గ్రామంలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్ కారం జయ, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ పంచాయతీ కార్యాలయానికి పక్కా భవనం, అంతర్గత రహదారులను సీసీలుగా మార్చేందుకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సునీల్దత్, భద్రాచలం ఏఎస్పీ వినీత్, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీపీవో లక్ష్మీరమాకాంత్, సీఐ వెంకటేశ్వర్లు, ఎంపీపీ రేసు లక్ష్మి, సర్పంచ్లు కారం జయ, జ్యోతి, జయమ్మ, జుంజూరి లక్ష్మి, ఎఫ్డీవో బాబూనాయక్, రేంజర్ కనకమ్మ, ఎంపీడీవో చంద్రమౌళి
పాల్గొన్నారు.