లక్నో : యూపీలోని అలీఘఢ్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. చర్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాబా బజ్రుద్దీన్ మసీదు, చారిత్రక దర్గాలో వీరంగం సృష్టించారు. దర్గా, మసీదులో విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ స్ధానిక ముస్లింలు డిమాండ్ చేశారు.
ఘటనా స్ధలానికి చేరుకున్న స్ధానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు నిరసనలకు దిగారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. దర్గా, మసీదులో దుండగుల దాడికి ధ్వంసమైన నిర్మాణాలకు మరమ్మతులు చేపట్టారు. కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి సుభేందు సింగ్ తెలిపారు.
Read More :
Tomato Price | సామాన్యులకు గుడ్న్యూస్.. దిగొస్తున్న టమాట ధరలు.. 63కే కిలో!