Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ నయ వంచనతో బిహార్ను నట్టేట ముంచారని పాటలీపుత్ర లోక్సభ నియోజకవర్గ ఆర్జేడీ అభ్యర్ధి మిసా భారతి ఆరోపించారు. ప్రధాని మోదీ పాటలీపుత్ర రావడం స్వాగతిస్తున్నామని, ఆయన రాకతో ఆ పార్టీకి రావాల్సిన మరో 5,000 నుంచి 10,000 ఓట్లు రాకుండా పోతాయని అన్నారు.
బిహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా, ప్యత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తామని కాషాయ పాలకులు ఊదరగొట్టి ఉసూరుమనిపించారని చెప్పారు. బిహార్లో యువతకు ఉపాధి పేరిట పలు కర్మాగారాలు ప్రారంభిస్తామని గొప్పలు చెప్పారని గుర్తుచేశారు. తేజస్వి యాదవ్ యువతకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు.
17 ఏండ్లుగా సాధ్యం కాని పనులను తేజస్వి యాదవ్ 17 నెలల్లో సాధించారని చెప్పారు. తేజస్వి యాదవ్ కేవలం ఏడాదిన్నదలోనే 5 లక్షల ఉద్యోగాలను యువతకు అందించారని గుర్తుచేశారు. తేజజ్వి యాదవ్ చేపట్టిన పనులతో ప్రజల్లో ఆయన పట్ల విశ్వాసం, నిలకడ ఉందని వెల్లడవుతోందని ఆమె చెప్పుకొచ్చారు.
Read More :
Harish Rao | రైతుల గుండెలపై తన్నింది రేవంత్రెడ్డి ప్రభుత్వం : హరీశ్రావు