బాన్సువాడ, ఆగస్టు 9: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు మళ్లీ విజృంభించాయి. ఆదివారం సంగమేశ్వర కాలనీకి చెందిన సితార అనే మూడేండ్ల చిన్నారిపై దాడిచేశాయి. అమ్మమ్మతో కలిసి చెత్తను పారవేయడానికి వెళ్లగా వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బాన్సువాడ నుంచి నిజామాబాద్ దవాఖానకు రిఫర్ చేశారు. అలాగే పలు కాలనీల్లో మరో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు యువకులపై \వీధి కుక్కలు దాడి చేశాయి. గాయాలైన వారు దవాఖానకు వచ్చినట్లు దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ ప్రకాశ్ తెలిపారు.
అలాగే బాన్సువాడకు చెందిన చిన్నారులు ఖాలిద్, రహీంతోపాటు మరో ఇద్దరు గయాసింగ్ ( సర్వాపూర్ ), జలీల్(కోమలమంచ), మొగులాలి ( గండివేట్ ) కూడా కుక్కకాటు బారిన పడి చికిత్స కోసం దవాఖానకు వచ్చినట్లు వివరించారు. కొన్ని రోజులుగా పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నది. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.