బారామతి, ఆగస్టు 9 : మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయ ప్రాంగణంలో ఆదివారం ఒక ప్రైవేట్ శిక్షణ విమానం కూలిపోయింది. రన్వేకు కొద్ది దూరంలో జరిగిన ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే విమానం పూర్తిగా దెబ్బతిన్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక తప్పిదం వల్ల ఇది చోటు చేసుకుందా లేదా మానవ పొరపాటా? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
కాగా, ఈ విమానాశ్రయంలో ఇలా ఒక ప్రైవేట్ విమానం కూలిపోవడం ఏడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి 28న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఇదే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలడంతో ఆయనతో పాటు మరో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.