Jammu And Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్ (south Kashmir)లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఓ వలస కార్మికుడి (Migrant Worker)ని కాల్చి చంపారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ధృవీకరించారు.
పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతం (Tumchi Nowpora )లో యూపీకి చెందిన వలస కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సదరు కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మృతి చెందిన కార్మికుడిని యూపీకి చెందిన ముఖేష్గా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
#Terrorists fired upon one labourer identified as Mukesh of U.P in Tumchi Nowpora area of #Pulwama, who later on succumbed to his injuries. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) October 30, 2023
Also Read..
Viral Video | గాల్లోకి నోట్లు వెదజల్లుతూ.. బాణసంచా కాలుస్తూ రచ్చ.. ముగ్గురు అరెస్ట్
Kerala blasts | కేరళ వరుసపేలుళ్ల ఘటనలో 12 ఏళ్ల బాలిక మృతి.. 3కి చేరిన మరణాల సంఖ్య