Oxygen Cylinder for just Rs 1 : కరోనా వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు ! ఊపిరి పీల్చుకోవడానికి అవస్థ పడుతుంటే.. ఆ సమయంలో ప్రాణవాయువు ( Oxygen ) దొరక్కపోతే ఎంతలా కొట్టుమిట్టాడాల్సి వస్తుందో కూడా తెలుసు !! ఇంకా చెప్పాలంటే ఒకానొక సమయంలో ఆక్సిజన్ దొరక్క ఆయన కూడా ఆ అవస్థ అనుభవించాడు. అందుకే తనలా కరోనా రోగులు ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదని అనుకున్నాడు. ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడే రోగులకు తన వంతుగా సాయం చేయాలనుకున్నాడు. అందుకే తన ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను కేవలం ఒక్క రూపాయికే నింపుతూ తన దయాగుణాన్ని చాటుకుంటున్నాడు. అతనే యూపీకి చెందిన మనోజ్ గుప్తా. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్లోని హమీన్పూర్కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ గుప్తా రిమ్జిమ్ ఇస్పాత్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. గత ఏడాది ఆయన కూడా కరోనా బారిన పడ్డాడు. ఇప్పటిలానే అప్పుడు కూడా ఈయన ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నాడు. కరోనాతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆక్సిజన్ దొరక్కపోతే ఎంత బాధ ఉంటుందో దాన్ని ఆయన అనుభవించాడు. అందుకే ఇప్పుడు దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్ కొరతను చూసి ఎంతగానో చలించిపోయాడు. మొదటి వేవ్ సమయంలో తాను పడ్డ అవస్థను గుర్తు చేసుకున్న ఆయన.. తనవంతుగా ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తన స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉత్పత్తి చేస్తున్నా ఆక్సిజన్ను కరోనా రోగులకు అందించాలని అనుకున్నాడు.
తన ప్లాంట్లో రోజుకు 1000 సిలిండర్లను రీఫిల్లింగ్ చేసే సామర్థ్యం ఉండగా.. ఒక్కో సిలిండర్ను కేవలం ఒక్క రూపాయికే నింపి అందిస్తున్నాడు. నిజానికి ఉచితంగానే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేయాలని మనోజ్ సిన్హా అనుకున్నాడంట. కానీ తమ ఉత్పత్తులకు బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండటంతో కనీస చార్జీ కింద ఒక్క రూపాయి తీసుకుంటున్నట్లు మనోజ్ సిన్హా తెలిపారు. కరోనా రోగుల బంధువులు వచ్చి తమ ఆధార్ కార్డు, రోగి ఆర్టీ-పీసీఆర్ రిపోర్టు చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ నింపుతున్నట్టు తెలిపారు.
తన బాట్లింగ్ ప్లాంట్లలో గుప్తా ఇప్పటివరకూ వేయికి పైగా ఆక్సిజన్ సిలిండర్ల ( Oxygen Cylinder ) ను నింపి వేలాది మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడారు. ఒక్క రూపాయికే సిలిండర్ నింపుతున్నట్లు తెలిసి లఖ్నవూ, ఝాన్సీ, బందా, అలీగఢ్, లలిత్పూర్, కాన్పూర్ తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్లాంట్కు వస్తున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. పెషేంట్లకు సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం కష్టంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్లు అత్యధికంగా రూ. 30 వేలకు విక్రయిస్తున్నారు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో.. ఆక్సిజన్కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ నింపుతున్న మనోజ్ సిన్హా దయాగుణాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి