న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మీనాక్షి లేఖ(Meenakshi Lekhi).. విపక్ష ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం లోక్సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. విపక్ష సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మంత్రి మీనాక్షి లేఖి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఒక నిమిషం మీరు నా మాటలు వినాలని, శాంతంగా ఉండాలని, లేదంటే ఈడీ మీ ఇంటికి వస్తుందని మంత్రి మీనాక్షి హెచ్చరించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీ ఇంటికి వస్తుందని మంత్రి మీనాక్షి వార్నింగ్ ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. బీజేపీ మంత్రులు పార్లమెంట్లోనే దమ్కీలు ఇస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు నిజమే అని కూడా కొందరు అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో మంత్రి మీనాక్షి లేఖి వీడియో వైరల్ అవుతోంది.
Wow Modi minister Meenakshi Lekhi openly threatens an opposition MP, “shant raho tumhare yahan na ED ajeye”on the floor of the House. Brazen pic.twitter.com/wd2HpXjeNN
— Swati Chaturvedi (@bainjal) August 3, 2023