ముంబై : వాడి పడేసి మాస్క్లను ఉపయోగించి పరుపులు, దిండ్లు తయారు చేస్తున్నాడో ప్రబుద్ధుడు. ఈ బండారం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగింది. ఇక్కడి పరుపులు తయారుచేసే కర్మాగారం పత్తికి బదులుగా వాడిపడేసిన మాస్క్లను, చినిగిపోయిన దుప్పట్లను ఉపయోగించినట్లుగా గుర్తించారు. ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి పెద్ద మొత్తంలో దాచి ఉంచిన మాస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం.
వాడిపడేసిన మాస్కులు, చినిగిపోయిన దుప్పట్లను వాడి పరుపులు తయారుచేస్తున్న విషయాన్ని జల్గావ్లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఎంఐడీసీలోని కుసుంబ గ్రామంలో ఉన్న మేట్రస్ కర్మాగార ప్రాంగణాన్ని అధికారులు సందర్శించినప్పుడు ఉపయోగించిన మాస్కులతో పరుపులు నింపినట్లు కనుగొన్నారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ చంద్రకాంత్ గవాలి తెలిపారు.
ఫ్యాక్టరీ యజమాని అమ్జాద్ అహ్మద్ మన్సూరిపై కేసు నమోదైంది. పోలీసులు ఇప్పుడు ఇతరులపై ప్రమేయం ఉన్న విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారని గవాలి చెప్పారు. మాస్కులను ఇంత పెద్ద మొత్తంలో ఎలా సేకరించారు, దీని వెనుక ఎవరున్నారు, దవాఖానల నుంచి ఎవరు సేకరించి అందించారు.. అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సదరు కంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్న మాస్క్లను పోలీసులు ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి తరలించి ఎలాంటి ఇబ్బందుల రాకుండా కాల్చివేసినట్లు స్థానికులు తెలిపారు.
మహారాష్ట్రలో 5,754 కొత్త కరోనావైరస్ కేసుల నమోదుతో పాటు థానే జిల్లాలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 3,73,364 కు చేరుకున్నదని ఒక అధికారి తెలిపారు.
సమాజంలో వివక్ష ఏ రూపంలో ఉన్నా పారద్రోలాలి: వెంకయ్యనాయుడు
సౌదీ విమానాశ్రయం, ఎయిర్బేస్పై హైతీ డ్రోన్ దాడి
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ప్రభుత్వ చర్యలపై సంతృప్తిగా లేం : గుజరాత్ హైకోర్టు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
సెనేట్లో మెజార్టీ సాధిద్దాం : డొనాల్డ్ ట్రంప్
తొలిసారిగా అంతరిక్షంలో కాలిడిన యూరి గగారిన్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..