అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇస్రోజివాడి
రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదకరంగా మొక్కలు
పల్లె ప్రగతి పనులన్నీ స్వల్పకాలంలోనే పూర్తి
కామారెడ్డి రూరల్, మార్చి 31 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో కామారెడ్డి మండలంలోని ఇస్రోజివాడి గ్రామం అభివృద్ధి లో దూసుకుపోతున్నది. గ్రామంలో కనీస అవసరాలతో పాటు పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ది. గ్రామంలో ప్రభుత్వ భూములు సరిపడా లేకపోయినా ఉన్నంతలోనే పల్లె ప్ర కృతి వనం, వైకుంఠధామాలు ఏర్పాటు చేశారు.
ఇరువైపులా పచ్చని తోరణాలు
ఇస్రోజివాడి గ్రామానికి రెండు వైపులా దారులు ఉన్నాయి. కామారెడ్డి నుంచి పోసానిపేట్కు వెళ్లే దారితో పాటు కామారెడ్డి నుంచి గర్గుల్కు ఉన్న రెండుదారులకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు నిరంతర పర్యవేక్షణతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గత సంవత్సరం నాటిన మొక్కలకు కంచెలను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడంతో అవి పెద్దగా పెరిగి స్వాగత తోరణాలుగా మారాయి. గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద, వైకుంఠధామం సమీపంతో పాటు రైతు వేదిక చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పెద్దపెద్ద మొక్కలను నాటడంతో పచ్చదనం పరుచుకున్నది.
వంద శాతం ప్రగతి పనులు పూర్తి
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో వైకుంఠధామం, కంపోస్టుషెడ్డు, పల్లెప్రకృతి వనం, మంకీ ఫుడ్ కోర్టు పనులు పూర్తయ్యాయి. ప్రతి రోజూ ఉదయం గ్రామంలో చెత్తను సేకరిస్తున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటుతున్నారు.
సమస్యల పరిష్కారం..
గ్రామంలో సమస్యలను ఎప్పటికప్పుడు పరి ష్కరిస్తున్నాం. బాధ్య తలు చేపట్టినప్ప టి నుం చి ఇప్పటి వరకు సుమా రు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, తాగునీటిని సమస్య తలెత్తకుండా కొత్త బోరు మోటర్లు ఏర్పాటు చేశాం.
-కొత్త మమత, సర్పంచ్