Mamata Banerjee | కేంద్రంలోని మోదీ సర్కార్కు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అల్టిమేటం (Ultimatum) జారీచేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు (Pending Funds) ఇవ్వకపోతే భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
శుక్రవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న దీదీ ఈ సందర్భంగా మోదీ సర్కార్పై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన చాలా వరకు నిధులను పెండింగ్లో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించకపోతే ఊహించని రీతిలో నిరసనలు చేపడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
బెంగాల్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ. 9,330 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ.6,900 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దీంతోపాటు నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి రూ.830 కోట్లు, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రూ.770 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.350 కోట్లు, మధ్యాహ్న భోజనం కోసం రూ.175 కోట్ల మేర కేంద్రం నుంచి చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని పథకాలకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది. ఈ పెండింగ్ నిధులను ఏడు రోజుల్లోగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి దీదీ అల్టిమేటం జారీ చేశారు.
Also Read..
Nitish Kumar | ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్..?
Arvind Kejriwal | ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఆఫర్ చేశారు.. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
Houthis | మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబల్స్.. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్పై క్షిపణితో దాడి