కోల్కతా : ఒడిశాలోని (Odisha Train Accident) బాలాసోర్ రైలు ప్రమాదాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఒకే సమయంలో మూడు రైళ్ల మధ్య ప్రమాదం జరిగితే దీనిపై దర్యాప్తు చేపట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా అని దీదీ ప్రశ్నించారు.
దుర్ఘటనపై కేంద్రం రోజుకో కొత్త వివరాలతో ముందుకొస్తోందని, అసలు ఈ ఘటనపై విచారణ ముగిసిందా అని ఆమె నిలదీశారు. ఈ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించారు…నిజాలకు పాతరవేసేందుకేనా అని ఆమె ప్రశ్నించారు. ఇక గతంలోనూ ఒడిశా రైలు ప్రమాదం విషయంలో మోదీ సర్కార్ లక్ష్యంగా మమతా బెనర్జీ విమర్శలతో విరుచుకుపడ్డారు. వాస్తవాలను మభ్యపెట్టి ఇతరులపై నింద మోపేందుకు ప్రభుత్వం రైలు ప్రమాద ఘటనను రాజకీయం చేస్తోందని ఆమె విమర్శించారు.
బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది మరణించారని కేంద్రం అధికారికంగా చెబుతుండగా ఇంకా చాలా మృతదేహాలను గుర్తించాల్సి ఉందని దీదీ పేర్కొన్నారు. దుర్ఘటనకు సంబంధించి సీబీఐ విచారణపై ఆమె స్పందిస్తూ సీబీఐ విచారణ క్రిమినల్ కేసులకు చేపడతారని, రైల్వే కేసులకు కాదని అన్నారు. సత్యాన్ని అణిచివేయరాదని మోదీ సర్కార్పై దీదీ చురకలు వేశారు. కాగా, బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది మృతిచెందగా, ఇప్పటి వరకు 170 మంది మృతదేహాలను గుర్తించినట్లు ఒడిశా సర్కార్ వెల్లడించింది.
Read More
Odisha Train Accident: కోరమండల్ రైలు ప్రమాదం.. సడన్గా చిమ్మచీకటి.. లైవ్ వీడియో వైరల్!