న్యూఢిల్లీ: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం(Odisha Train Accident)లో 278 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనకు చెందన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఒడిశా టీవీ షేర్ చేసిన ఆ వీడియోలో కోరమండల్ రైలుకు చెందిన ప్రమాద దృశ్యాలు ఉన్నాయి. ఏసీ బోగీలో శానిటేషన్ వర్కర్ మాపింగ్ చేస్తున్న సమయంలో ఓ వీడియో తీశారు. మాప్ చేస్తున్న సమయంలో ఆ బోగీలో ఉన్న కొందరు ప్రయాణికులు నిద్రిస్తున్నారు. అయితే ఒక్కసారి రైలు జర్క్ ఇచ్చింది. ఇక ఆ జెర్క్తో కెమెరా షేక్ అయ్యింది. ఒక్కసారిగా చిమ్మచీకటి కమ్మేసింది. ఆ చీకట్లో అరుపులు, కేకలు వినిపించాయి. అకస్మాత్తుగా వీడియో ఎండ్ అయ్యింది.
ఓ ప్రయాణికుడు ఆ వీడియో తీసినట్లు తెలుస్తోంది. గూడ్స్, కోరమండల్, యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీకొన్న ఘటనలో సీబీఐ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమాదంలో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు.