కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి.. మహ్మద్ అలీ జిన్నా బాటలో నడుస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ విమర్శించింది. స్వాతంత్ర్యానికి ముందు జిన్నా కలకత్తాలో మతకల్లోలాలు రేపి 20 వేల మంది చావుకు కారణమయ్యాడని, ఇప్పుడు మమతాబెనర్జి సైతం అవే విధానాలను అనుసరించి బెంగాల్ను బంగ్లాదేశ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నదని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మండిపడ్డారు. మమతాబెనర్జి ఖేలా దివస్ నిర్వహణ వెనుక ఉద్దేశం ఇదేనని ఆయన ఆరోపించారు.
ఇటీవల పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రాష్ట్రంలో 12 వేల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, బీజేపీకి చెందిన 45 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని దిలీప్ ఘోష్ చెప్పారు. మమతాబెనర్జి ఇదే ఆటను దేశమంతటికీ విస్తరించాలని భావిస్తే.. దేశం అందుకు ఆమోదం తెలుపుతుందని తాను భావించడంలేదని ఆయన పేర్కొన్నారు.