Mamata Banerjee : లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలు పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీ, ఆశా వర్కర్లకు పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి.
ఆశా, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు నెలకు రూ. 750 చొప్పున పెంచామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అంగన్వాడీ వర్కర్ల వేతనాలు రూ. 8250 నుంచి రూ. 9000కు పెరగ్గా, ఆశా వర్కర్ల వేతనాలు రూ. 6500కు పెరిగాయి.
ఆశా వర్కర్లు కష్టపడి పనిచేస్తారని, సంక్లిష్ట సమయాల్లో వారు తమకు అండగా నిలిచారని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. వారి వేతనాలను ఏప్రిల్ నుంచి రూ. 750 పెంచుతున్నామని ప్రకటించడం తనకు సంతోషం కలిగిస్తోందని ఆమె వెల్లడించారు.
Read More :
Skin cancer | క్యాన్సర్ను నియంత్రించే బియ్యం.. చర్మ క్యాన్సర్కు చెక్..!