Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని, ఈ విషయంలో కాషాయ పార్టీ కంటే తాము మరింత విశ్వాసంతో ఉన్నామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పట్నాలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆగ్రహంతో ఈసారి బీజేపీకి ఘోర పరాజయం ఎదురవనుందని అన్నారు.
ప్రధాని మోదీ ముజ్రా వ్యాఖ్యలను ఖర్గే తీవ్రంగా ఖండించారు. ప్రధాని వ్యాఖ్యలు బిహార్ ప్రజలను అవమానించడమేనని, ప్రధాని ఇలాంటి భాషను వాడటం సరైంది కాదని, ఇది తప్పిదమని, ఎవరూ ఇలాంటి పదజాలం వాడరాదని ఖర్గే హితవు పలికారు. మరోవైపు చండీఘఢ్లో జరిగిన ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
అంబానీ, అదానీల కోసం ప్రధాని మోదీ ఖాళీగా ఉంచిన 30 లక్షల ఉద్యోగాలను తాము భర్తీ చేస్తామని చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీకు ఎలాంటి ప్రభుత్వం కావాలో ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలని ఆమె ప్రజలను కోరారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు మనకు అవసరమని చండీఘఢ్ నుంచి దేశమంతటికీ సందేశం పంపాలని ఆమె పిలుపు ఇచ్చారు.
Read More :
Babar Azam | అంతర్జాతీయ T20ల్లో రోహిత్ శర్మను దాటేసిన బాబర్ ఆజమ్..