bridge collapses | బీహార్ (Bihar)లో మరో వంతెన కూలిపోయింది (bridge collapses). ఈనెల 4వ తేదీన ఖగడియా జిల్లా భగల్ పూర్ లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిషన్ గంజ్ జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. తాజాగా గంగానది (river Ganga)పై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన కూలిపోయింది.
బీహార్ లోని వైశాలి (Vaishali) జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెనలోని కొంత భాగం బుధవారం కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో వంతెన దాటుతున్న కొందరు చిక్కుకుపోయినట్లు చెప్పారు. జూన్ 20 నాటికి వంతెనను కూల్చివేయాల్సి ఉండగా.. ఇంతలోనే వంతెన కూలిపోయినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే మూడో ఘటన కావడం గమనార్హం.
#WATCH | Portion of a temporary bridge built on river Ganga in Bihar's Vaishali washed away due to strong winds. The bridge connected Raghopur to the Vaishali District Headquarters. pic.twitter.com/tX3XzWjieg
— ANI (@ANI) June 28, 2023
Also Read..
Asin | ఇందు కోసం 5 నిమిషాల సమయం వృధా.. విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన గజినీ భామ
Ford Layoff | ఉద్యోగులకు షాకిచ్చిన ఫోర్డ్.. 3 వేల మందిపై వేటు..!
Iron Pillar | రద్దీ రోడ్డుపై కూలిన ఐరన్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం