న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత రెండు రోజుల నుంచి వరుసగా నాలుగు లక్షలకుపైగా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, హర్యానా, బీహార్ ఈ 12 రాష్ట్రాల్లోనే భారీగా కొత్త కేసులు బయటపడుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా వెల్లడించారు.
తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇటీవల కేసులు బాగా పెరిగినా ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయని ఆర్తి అహుజా తెలిపారు. ఇక పంజాబ్, జమ్ముకశ్మీర్, అస్సాం, హిమాచల్ప్రదేశ్, పుదుచ్చేరి, మేఘాలయా, త్రిపుర, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్ రోజూవారీ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నదని ఆమె చెప్పారు.
కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని అహుజా తెలిపారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతుందని చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 16.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. అదేవిధంగా 18-44 ఏండ్ల మధ్య వయసు వారికి కూడా ఇప్పటివరకు 11.81 లక్షల డోసుల టీకాలు ఇచ్చినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్.. కరోనా సాయం ఫైలుపై తొలి సంతకం
పావురం కాలికి చిప్.. గూఢచర్యమేనా..!
వరుసగా రెండో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
పురివిప్పిన మయూరం.. కనువిందు చేసిన నాట్యం.. వీడియో
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు