హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న డిజిటల్ విధానాల తరహాలోనే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కూడా ఈసారి పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్లలో, బూత్కు ఇద్దరు చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియపై పార్టీ ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మండలిలో ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు చాగండ్ల నరేంద్రనాథ్, సోమా భరత్ కుమార్గుప్తా, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.

ముఖ్య నిర్ణయాలు ఇవే
సభ్యత్వ నమోదు కోసం నియమితులైన జిల్లాల ఇన్చార్జులు వీరే