కలప వినియోగానికి ప్రత్యామ్నాయం
ఏనుగొండ మౌలాలి గుట్టలో స్థలం గుర్తింపు
మహబూబ్నగర్ టౌన్, మే 3 : కలప వినియోగానికి ప్రత్యామ్నాయంగా మృతదేహాల దహన సంస్కారాల కో సం మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఎల్పీజీ వాటికను ఏర్పాటు చేయనున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, గజ్వేల్ మున్సిపాలిటీల్లో నెలకొల్పిన మాదిరిగానే మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని ఎనుగొండ సమీపంలో ఉన్న మౌలాలీ గుట్ట వద్ద డంపింగ్ యార్డు స్థలంలో రూ.12 లక్షలతో ప్రయోగాత్మకంగా ఎల్పీజీ డబుల్ బర్న్ ప్లాంట్ ఏర్పా టు చేయాలని నిర్ణయించారు.
కలెక్టర్ వెంకట్రావు సూచనలతో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, మున్సిపల్ అధికారులతో కలిసి ఇటీవలే మౌలాలీ గుట్ట వద్ద ప్లాంట్ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్లాంట్ కోసం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకం గా ఒక షెడ్డు సహా సింగిల్ ఫేజ్ విద్యుత్ కనెక్షన్, నీరు, ఎ ర్తింగ్ కనెక్షన్, 3 ఎల్పీజీ వాణిజ్య సిలిండర్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ గ్యాస్ సెన్సార్ విధానం లో 4 కిలోల బర్నర్ గంటకు 4 కిలోల గ్యాస్ను మండిస్తున్నది.