ఇటానగర్: (Kiren Rijiju) అరుణాచల్ ప్రదేశ్లో సాంప్రదాయ పాటపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గ్రామస్తులతో కలిసి నృత్యం చేశారు. గ్రామస్తులతో కలిసి సరదా ఆడిపాడి వారిలో ఒకరిగా కలిసిపోయారు. ఇటీవల సజోలాంగ్ గ్రామ పర్యటన సందర్భంగా కిరెన్ రిజిజు గ్రామస్తులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అరుణాచల్ప్రదేశ్లోని వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్ట్ను సమీక్షించడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల కజలాంగ్ వెళ్లారు. అక్కడ మిజి అని పిలుచుకునే స్థానిక సజోలాంగ్ ప్రజలు తమ సాంప్రదాయ పాట, ఆటలతో మంత్రికి స్వాగతం పలికారు. తాను కూడా అక్కడి జానపద సంగీతానికి పాదం కదిపి నృత్యం చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ప్రొఫైల్లో షేర్ చేశారు. ‘అతిథులు తమ గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా సజోలాంగ్ ప్రజల సాంప్రదాయ ఆనందం ఇది. అసలు జానపద పాటలు, నృత్యాలు అరుణాచల్ ప్రదేశ్లోని ప్రతి సమాజానికి అవసరమైనవి’ అని రాశారు.
కిరణ్ రిజిజు వీడియోను వీక్షించిన ప్రధాని మోదీ.. ఆయనను ఎంతో ప్రశంసించారు. ‘మా న్యాయ శాఖ మంత్రి కిరణ్ కూడా మంచి డ్యాన్సర్! అరుణాచల్ ప్రదేశ్ యొక్క శక్తివంతమైన, అద్భుతమైన సంస్కృతిని వీక్షించడం చాలా సంతోషంగా ఉన్నది’ అని కితాబునిచ్చారు.
Our Law Minister @KirenRijiju is also a decent dancer!
— Narendra Modi (@narendramodi) September 30, 2021
Good to see the vibrant and glorious culture of Arunachal Pradesh… https://t.co/NmW0i4XUdD
ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైన ముందడుగు : వెంకయ్యనాయుడు
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు
జమ్ము చేరిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
చైనాకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నేపాల్ ప్రజలు
సిద్ధూ-చన్నీ భేటీ షురూ! హైకమాండ్ నుంచి దూత..
అహ్మదాబాద్లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!
ట్యునీషియాలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలిసారి మహిళకు అవకాశం
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా నటుడు
రిటైర్మెంట్ ప్రకటించిన డ్రాగ్ ఫ్లికర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..