సీఎం కేసీఆర్ రైతాంగానికి మేలు చేస్తున్నారు
24 గంటల కరెంట్.. గోదావరి జలాలు తెచ్చారు
వడ్ల దిగుబడుల దృష్ట్యా అదనంగా కొనుగోలు కేంద్రాలు
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
పాలమాకులలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
నంగునూరు, ఏప్రిల్ 15: రైతులకు ఏ కష్టం రానివ్వం.. సీఎం కేసీఆర్ రైతాంగానికి అన్ని విధాల మేలు చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్ల తొలి ఫలితం ఇక్కడి రైతులు అందుకున్నారు. ఈ యాసంగిలో 2 లక్షల 80 వేల ఎకరాల్లో పంట సాగైందని.. అందుకనుగుణంగా కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం నంగునూరు మండలం పాలమాకులలో కొనుగోలు కేం ద్రాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాన్నామన్నారు. అధిక దిగుబడుల దృష్ట్యా అదనంగా 50 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండుటెండల్లో గోదావరి జలాల రాకతో బంగారు పంటలు పండడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ రైతాంగానికి నాణ్యమైన కరెంట్, గోదావరి జలాలు తేవడంతో భూగర్భజలాలు పుష్కలంగా పెరిగాయన్నారు. ఎక్కువ శాతం వరిపంటలు వేయడంతో కూలీల కొరత ఏర్పడిందని, రైతులకు వ్యవసాయ యంత్రాల కోసం రూ.1500 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాల కోసం బడ్జెల్లో రూ.3 వేల కోట్లు పెట్టామన్నారు.
ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలి
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మంత్రి అన్నారు. పెట్టుబడి తక్కువ లాభా లు ఎక్కువ గల ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు వివిధ రకాల సబ్సిడీలు ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేశాక నాలుగేండ్లలో పంట వస్తుందన్నారు. ఆయిల్పామ్ సాగుచేస్తూనే అంతర పంటలు వేసుకోవచ్చన్నారు. రైతులు ఆ దిశగా చైతన్యం కావాలన్నారు. ఇప్పటికే కొందరు రైతులను సాగుపై అవగాహన పెంపొందించుకునేందుకు ఖమ్మం జిల్లాలో విజ్ఞాన యాత్రకు పంపినట్లు తెలిపారు. మరింతమంది వెళ్తామంటే పంపిస్తామన్నారు. నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గోపాల్రావు, కొమురవెల్లి ఆలయ కమిటీ చైర్మన్ దువ్వల మల్లయ్య, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎం పీపీ జాప శ్రీకాంత్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోంరెడ్డి, పీఏసీఎస్ చైర్మనుల మహిపాల్రెడ్డి, కోల రమేశ్గౌడ్, సర్పంచు కుమార్, ఎంపీటీసీ తులసి పరమేశ్వర్, నాయకులు సంగు పురేందర్, చందు, ఐలయ్య, జాజాల కనకరాజు, రవి, కనకయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అనంతరం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు రాజిరెడ్డి ఇటీవల మృతి చెం దాడు. విషయం తెలుసుకున్న మంత్రి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఇవి కూడా చదవండి
చిరు వ్యాపారులకు అమెజాన్ ఆసరా
40ల తర్వాత ఆరోగ్యానికి యుక్తవయస్సులో వ్యాయామం తప్పనిసరి