త్రిస్సూర్: కేరళ వ్యవసాయశాఖ మంత్రి వీఎస్ సునీల్ మరోసారి కరోనా బారినపడ్డారు. మంత్రి సునీల్ కుమార్తోపాటు, ఆయన కుమారుడు నిరంజన్ కృష్ణ కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో వారిద్దరిని త్రిస్సూర్లో మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. వైరస్ నుంచి బయటపడేవరకు వారిద్దరు దవాఖానలో ఉంటారని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం మంత్రి పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. గత వారం రోజుల్లో మంత్రిని కలిసినవారు క్వారంటైన్లోకి వెళ్లాలని ఆరోగ్యశాఖ సూచించింది.
కాగా, మంత్రి కేవీ సునీల్ గతేడాది సెప్టెంబర్లో మొదటిసారి కరోనాబారినపడ్డారు. అప్పుడు తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందారు. అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోజికోడ్లోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స అనంతరం డిశ్చార్జీ అయిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..