జైపూర్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆదివారం నుంచి సాధనలో నిమగ్నమైపోయారు. ఆదివారం మధ్యాహ్నం జైపూర్ చేరుకున్న ఆయన.. నేరుగా గాల్టా రోడ్డులోని విపాసన సాధన కేంద్రం వచ్చారు. కేజ్రీవాల్ 10 రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ ఇక్కడకు వచ్చినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ పది రోజుల పాటు ఆయన పార్టీకి సంబంధించిన ఏ సమావేశంలోగానీ, ఇతర కార్యక్రమాల్లోగానీ హాజరుకారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి సమాచారం ఇచ్చారు. అయితే, కేజ్రీవాల్ గైర్హాజరీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన అధికారిక పనులను ఇన్ఛార్జ్గా చూసుకుంటారు.
ఆదివారం మధ్యాహ్నం ఇండిగో విమానంలో జైపూర్ వచ్చిన కేజ్రీవాల్ విమానాశ్రయం నుంచి నేరుగా విపాసన సాధన కేంద్రానికి చేరుకున్నారు. జైపూర్లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు. ఎవర్నీ కలుసుకోలేదు. ఆయన ఇక్కడ 10 రోజులపాటు జరిగే విపాసన సాధన సెషన్లకు హాజరవుతారు.
ఈ 10 రోజులపాటు కేజ్రీవాల్ మొబైల్ ఫోన్, టీవీ, వార్తాపత్రికలు, ల్యాప్టాప్ వంటి సౌకర్యాలను వినియోగించరు. అక్కడ వీటి వినియోగంపై నిషేధం ఉంటుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందికి కేజ్రీవాల్ జైపూర్ రాక గురించి కూడా అధికారిక సమాచారం ఇవ్వలేదు. విపాసన సాధన కేంద్రం రాజస్థాన్లోని పురాతన ధ్యాన కేంద్రాలలో ఒకటి. దేశం నలుమూలల నుండి ప్రజలు సాధన నిమిత్తం ఇక్కడకు వస్తుంటారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత కొన్ని సంవత్సరాలుగా విపాసన ధ్యాన పద్ధతులను అభ్యసిస్తున్నారు. అతను ఎప్పటికప్పుడు సెలవు తీసుకుని ఇక్కడికి ధ్యానం నిమిత్తం వస్తుంటారు. గతంలో నాగపూర్తోపాటు అనేక ఇతర విపాసన కేంద్రంలో ఉండి ధ్యానం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందారు.
పారాలింపిక్స్లో డిస్కస్త్రోలో వినోద్కు కాంస్యం
ఆసియా జూనియర్ బాక్సింగ్లో రోహిత్కు స్వర్ణం
ఇవి తినే 109 ఏండ్లు బతికా : జాన్ టిన్నిస్వుడ్
రాముడు లేకుండా అయోధ్య లేదు : రామ్నాథ్ కోవింద్
నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
అంతర్జాతీయ విమానాలపై సస్పెన్షన్ పొడగింపు
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్లో మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..