టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే టీటీ, హైజంప్లో సిల్వర్ మెడల్స్ గెలువగా.. ఇప్పుడు మరో క్రీడాంశంలో మనవాడు కాంస్యం అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52) లో భారతదేశానికి చెంఇన క్రీడాకారుడు వినోద్ కుమార్ (vinod Kumar) .. 19.91 మీటర్ల దూరం డిస్కస్ను త్రో చేసి కాంస్య పతకాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఈ ప్రక్రియలో అతడు కొత్త ఆసియా రికార్డును కూడా సృష్టించాడు.
కాగా, పోలాండ్కు చెందిన పియోటర్ కోసెవిచ్ 20.02 మీటర్ల ప్రయత్నంతో స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, క్రొయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ 19.98 మీటర్ల దూరం విసిరి రజతం సాధించాడు. వినోద్ 17.46 మీటర్ల ప్రయత్నంతో ఫైనల్ ప్రారంభించి తన ఆటకు మెరుగులద్దాడు. ఐదవ, చివరి ప్రయత్నంలో 19.91 మీటర్ల దూరం డిస్కస్ విసిరి కాంస్య పతకం సాధించే మార్కును అందుకోగలిగాడు. వినోద్ కుమార్ కాంస్యం గెలవడంతో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే టీటీలో భవీనా పటేల్, హైజంప్లో నిషాద్ కుమార్ రజిత పతకాలు సాధించారు.
ఆసియా జూనియర్ బాక్సింగ్లో రోహిత్కు స్వర్ణం
ఇవి తినే 109 ఏండ్లు బతికా : జాన్ టిన్నిస్వుడ్
రాముడు లేకుండా అయోధ్య లేదు : రామ్నాథ్ కోవింద్
నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
అంతర్జాతీయ విమానాలపై సస్పెన్షన్ పొడగింపు
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్లో మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..