Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) నగారా మోగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల (Assembly Constituencies)కు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) బుధవారం ప్రకటించారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో కొత్తగా ఒక వెసులుబాటును కల్పించారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్న సమయంలో సీఈసీ రాజీవ్ కుమార్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో 100 ఏండ్లు పైబడిన ఓటర్లు (centenarian voters) సుమారు 17వేల మంది ఉన్నట్లు వెల్లడించారు.
‘కర్ణాటకలో 12.15 లక్షల మంది 80 ఏండ్లు దాటిన ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,976 మంది శతాబ్ది (100 ఏండ్లు పైబడిన) ఓటర్లే. అలాగే, ఎన్నికల సంఘంలో 5.55 లక్షల మంది వికలాంగులు నమోదై ఉన్నారు’ అని రాజీవ్ కుమార్ వెల్లడించారు. వందేండ్లు పైబడిన ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటకే కావడం గమనార్హం.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల(Assembly Constituencies)కు ఎన్నికలను నిర్వహించనున్నారు. అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్ చేపట్టనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 20వ తేదీ నామినేషన్లకు చివరి రోజు. ఏప్రిల్ 24వ తేదీ అభ్యర్థుల విత్డ్రాకు చివరి తేదీ అని ఇవాళ ఎన్నికల సంఘం ప్రకటించింది.
కర్ణాటకలో తొలిసారి 9.17 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగల ప్రజల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. 224 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 58 వేల 282 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీఈసీ వెల్లడించారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు సగటున 883.50 ఓటర్లు ఉంటారన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. 1320 పోలింగ్ స్టేషన్లలను కేవలం మహిళా అధికారులే మేనేజ్ చేయనున్నారు.
Also Read..
CEC Rajiv Kumar: 1028 కోట్ల విలువైన నగదు, వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నాం: సీఈసీ
Karnataka Elections: 80 ఏళ్ల వృద్ధులు.. దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు: సీఈసీ రాజీవ్ కుమార్