న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) ఇవాళ కొన్ని కీలక విషయాలను తెలిపారు. ఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) వేళ .. సుమారు 1028 కోట్ల విలువైన నగదు, వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 23 రెట్లు ఎక్కువ అని ఆయన వెల్లడించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో భారీ మొత్తంలో నగదుతో పాటు ఓటర్లపై ప్రభావితం చూపే వివిధ రకాల గిఫ్ట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
గత ఏడాది గుజరాత్(Gujarat)లో అసెంబ్లీ ఎన్నికల వేళ సుమారు 801 కోట్ల విలువైన నగదు, వస్తువుల్ని సీజ్ చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో 57 కోట్లు, మేఘాలయాలో 74 కోట్లు, నాగాలాండ్లో 50 కోట్లు, త్రిపురలో 45 కోట్ల విలువైన నగదుతో పాటు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.గుజరాత్లో 32 కోట్ల నగదు, 36 కోట్ల విలువైన బంగారం, 176 కోట్ల విలువైన గిఫ్ట్లు, 16 కోట్ల మద్యం, 564 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేసినట్లు సీఈసీ తెలిపారు.
Manifold increase in seizures marks increased focus on expenditure monitoring in the previous 5 State Elections. Seizures totaling over Rs. 1028 crores were recorded in the five states which is approx 23 times more than in previous elections: CEC #KarnatakaElections2023 pic.twitter.com/E3n7W230xq
— Election Commission of India #SVEEP (@ECISVEEP) March 29, 2023