Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే 13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల వరకూ 13.04 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.
జార్ఖండ్తో పాటు వయనాడ్ (Wayanad) లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక ఇవాళే జరుగుతున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడ కూడా పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 13.04 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk
— ANI (@ANI) November 13, 2024
Also Read..
Red Sea | ఎర్రసముద్రంలో అమెరికా యుద్ధ నౌకలపై హౌతీల దాడులు
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. జీరోకు పడిపోయిన విజిబిలిటీ