Jewellery | సాధారణంగా ఎవరైనా కొన్ని రోజులు ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లే సమయంలో తమ ఇంట్లోని విలువైన వస్తువులను ఎవరూ గుర్తించని చోట దాస్తుంటారు. బీరువాలో ఉన్న సొమ్ము దొంగలు ఈజీగా కొట్టేస్తారన్న అనుమానంతో.. వాటిని బీరువాలో కాకుండా ఇంట్లోని ఇతర చోట్ల పెడుతుంటారు. వంటగదిలోని పోపుల పెట్టె, దేవుడి గదిలో, బియ్యం బస్తాల్లో దాచి వెళ్తుంటారు. అయితే, మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం నగల పెట్టెను ఎవరూ ఊహించని విధంగా డస్ట్ బిన్ (dustbin)లో దాచిపెట్టి లేని కష్టాలను కొని తెచ్చుకున్నాడు.
మధ్యప్రదేశ్ రేవా (Rewa)కు చెందిన ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి భోపాల్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అయితే, ఇంట్లో ఉన్న నగలను (Jewellery) వెంట తీసుకెళ్లడం సేఫ్ కాదని భావించి.. వాటిని ఎక్కడ పెట్టాలబ్బా అని ఆలోచించాడు. సేఫ్ ప్లేస్లో వాటిని దాచాలనుకున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లు టూర్కు బయల్దేరే ముందు ఇంట్లోని రూ.12లక్షల విలువైన నగలను ఓ పెట్టెలో పెట్టి డస్ట్ బిన్లో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాడు. అయితే, అనుకోకుండా మున్సిపల్ కార్మికులు ఆ చెత్త డబ్బాను వ్యర్థాలు సేకరించే ట్రక్కులోకి వేసేశారు. ఆ చెత్తనంతా డంపింగ్ యార్డ్కు తరలించారు.
అయితే ట్రిప్ ముగించుకొని వచ్చిన ప్రమోద్ కుమార్.. నగల పెట్టె కోసం వెతకగా అది కనిపించలేదు. దీంతో దాన్ని ఎవరో దొంగలించారని ముందు భావించాడు. అయితే, ఆ తర్వాత తెలుసుకుని చెత్త నిర్వహణ సంస్థను ఆశ్రయించాడు. జరిగిందంతా వారికి వివరించాడు. దీంతో వారు రంగంలోకి దిగి చెత్త సేకరణ కార్మికులు, సిబ్బందితో కలిసి రీసైక్లింగ్ ప్లాంట్లో కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. చివరికి ఆ విలువైన పెట్టెను గుర్తించి ప్రమోద్ కుమార్కు అప్పగించారు.
Also Read..
Criminal Cases | ఆ రాష్ట్రంలో 186 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు.. 93 మంది నేరచరిత్ర కలిగిన వారు
Russian YouTuber | ఢిల్లీలో రష్యన్ యూట్యూబర్కు వేధింపులు.. అందంగా ఉన్నావు అంటూ వెంటపడిన ఆకతాయి