PM Modi | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రానికి త్వరలోనే రాష్ట్ర హోదా (statehood) దక్కుతుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు (assembly elections) కూడా త్వరలోనే జరుగుతాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదంపూర్ (Udhampur)లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. తాను ఎప్పుడూ భవిష్యత్ని దృష్టిలో పెట్టుకునే ముందు చూపుతోనే ఆలోచిస్తానని స్పష్టం చేశారు.
జమ్ము కశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ‘మోదీ ఎప్పుడైనా ముందుచూపుతోనే ఆలోచిస్తాడు. ఇప్పటి వరకూ జమ్ముకశ్మీర్లో వచ్చిన మార్పులు కేవలం ట్రైలర్ మాత్రమే. జమ్ము కశ్మీర్ను అద్బుత రాష్ట్రంగా మలిచే పనిలో బిజీగా ఉన్నాను. రానున్న రోజుల్లో అందమైన సినిమాని చూపిస్తాం. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం ఎంతో దూరంలో లేదు. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కూడా దక్కుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇక్కడి ప్రజలు ముఖాముఖి మాట్లాడొచ్చు. మీ సమస్యలను వారితో పంచుకోవచ్చు’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు.
#WATCH | J&K: Addressing a public rally in Udhampur, PM Modi says, “Modi thinks far ahead. So what has happened so far is just the trailer. I have to get busy in creating a new and wonderful picture of the new Jammu and Kashmir. The time is not far when Assembly Elections will be… pic.twitter.com/F8aHgialRA
— ANI (@ANI) April 12, 2024
Also Read..
Stealing Shoes | ఫుడ్ డెలివరీ బాయ్ చేతివాటం.. ఇంటి ముందు ఉంచిన ఖరీదైన షూ చోరీ.. VIDEO
AAP | ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నం : ఢిల్లీ మంత్రి అతిశీ
Bengaluru cafe blast | బెంగళూరు కేఫ్లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ఇద్దరు కీలక నిందితులు