న్యూఢిల్లీ : చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election Results) కాంగ్రెస్ పరాజయంపై ఆ పార్టీ నేతలు తలో రకంగా స్పందిస్తున్నారు. 20 ఏండ్ల కిందట కాంగ్రెస్ ఇలాగే మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలై కేవలం ఢిల్లీలో గెలిచిన విషయాన్ని ఈ సంర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గుర్తుచేసుకున్నారు.
ఓటమి నేర్పిన పాఠాలతో ఆశాభావంతో తాము 2024 లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతామని స్పష్టం చేశారు. కీలక హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను మట్టికరిపించిన కాషాయ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారం దిశగా దూసుకుపోతోంది.
సరిగ్గా 20 ఏండ్ల కిందట కాంగ్రెస్ పార్టీ చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని, కేవలం ఢిల్లీలో విజయం సాధించిందని జైరాం రమేష్ పేర్కొన్నారు. ఏమైనా తాము మరికొద్ది నెలల్లోనే తిరిగి పుంజుకుని లోక్సభ ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి కేంద్రంలో పాలనా పగ్గాలు చేపడతామని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
Read More :
INDIA bloc | మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం.. ‘ఇండియా’ కూటమి నాయకత్వం మార్పుపై టీఎంసీ పట్టు