Today History: అక్టోబర్ 31, 1984.. ఉదయం 9 గంటలు.. ప్రధాని నివాసం.. ఇందిరాగాంధీ అధికారులతో మాట్లాడుతున్నారు. ఇంతలో ఆమెకు అంగరక్షకులుగా ఉన్న వారు ఒక్కసారిగా ఆమెపై కాల్పులు జరిపారు. ఇందిరమ్మ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలింది. ఈ హత్యకు ప్రధాన కారకులైన సత్వంత్ సింగ్, కేహార్సింగ్లకు 1989 లో సరిగ్గా ఇదే రోజు ఉరిశిక్ష విధించారు. ఈ కేసులో మరో ముద్దాయి అయిన బియాంత్ సింగ్.. పోలీసుల కళ్లు గప్పి పారిపోతుండగా కాల్పిచంపారు.
ప్రధాని నివాసంలోని లాన్లో అధికారులతో మాట్లాడుతుండగా తొలుత ఇందిరాగాంధీపై తన సర్వీస్ రివాల్వర్తో బియాంత్ సింగ్ కాల్చాడు. నాలుగు బుల్లెట్లును ఇందిరమ్మ శరీరంలో దింపాడు. కొద్దిదూరంలో ఉన్న సత్వంత్సింగ్పై ‘ఏం చూస్తున్నావ్, త్వరగా కాల్చు’ అంటూ బియాంత్ సింగ్ అరిచాడు. దాంతో సత్వంత్సింగ్ తన ఆటోమేటిక్ రైఫిల్తో ఇందిరమ్మపై 25 సార్లు కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులు బియాంత్సింగ్, సత్వంత్సింగ్, కేహార్సింగ్ను పట్టుకున్నారు. సిక్కుల పవిత్ర క్షేత్రమైన గోల్డెన్ టెంపుల్లో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ చేపట్టడానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుని ఇందిరాగాంధీపై కాల్పులు జరిపినట్లు నిందితులు కోర్టుకు విన్నవించారు. ఈ ఆపరేషన్లో వందలాది మంది చనిపోయారు.
సత్వంత్ సింగ్తో పాటు హత్యకు కుట్ర పన్నిన కేహార్ సింగ్, బల్వంత్ సింగ్లను కూడా విచారించారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో బల్వంత్ సింగ్ను కోర్టు విడుదల చేసింది. ఇందిరమ్మ హత్యకు పాల్పడిన కుట్రదారులు సత్వంత్సింగ్ కేహార్ సింగ్లకు కోర్టు మరణశిక్ష విధించింది.
ఇందిరాగాంధీ మరణించిన ఐదేండ్ల తర్వాత తీహార్ జైలులో వీరికి ఉరిశిక్షను అమలు చేశారు. వీరి మృతదేహాలను కూడా వారి బంధువులకు ఇవ్వకుండా జైలు అధికారులే వారి అంత్యక్రియలు జరిపించారు.
2020: పురుషులపై అత్యాచారం కేసులో ఇండోనేషియా పౌరుడు రెయిన్హార్డ్ సినాగాకు జీవిత ఖైదు విధించిన బ్రిటన్ కోర్టు
2012: సిరియా రాజధాని డమాస్కస్లో ఆత్మాహుతి దాడి, 26 మంది దుర్మరణం
2002: బంగ్లాదేశ్ కరెన్సీ పైనుంచి మాజీ అధ్యక్షుడు షేక్ ముజీబ్ ఫొటో తొలగింపు
1983: తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్
1976: లోప్నోర్ ప్రాంతంలో అణు పరీక్ష నిర్వహించిన చైనా
1950: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని గుర్తించిన బ్రిటన్
1947: భారతదేశ విభజనను అంగీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ
1929: పేదలకు సేవచేసేందుకు భారతదేశంలోని కలకత్తాకు వచ్చిన మదర్ థెరెసా
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
రిలాక్స్ కోసం కాఫీ తాగుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి
ప్రతినెలా రూ.1500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 35 లక్షలు…
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..