IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (Bureau of Civil Aviation Security) షాక్ ఇచ్చింది. ఇటీవలే ముంబై ఎయిర్ఫోర్ట్ (Mumbai Airport)లో విమానం ఆలస్యం కావడంతో ఇండిగో ప్రయాణికులు రన్వేపైనే కూర్చొని భోజనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న బీసీఏఎస్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) ఇండిగోకు, ముంబై ఎయిర్పోర్ట్కు భారీ జరిమానా విధించింది. ఇండిగోకు రూ.1.2 కోట్లు, ముంబై ఎయిర్ఫోర్ట్కు రూ.90 లక్షల పెనాల్టీ వేసింది. నియమాలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్టు డీజీసీఏ, బీసీఏఎస్ తెలిపింది.
స్పైస్జెట్, ఎయిర్ ఇండియాలపై కూడా జరిమానా
దీంతోపాటు స్పైస్జెట్, ఎయిర్ ఇండియా సంస్థలపై కూడా డీజీసీఏ జరిమానా విధించింది. ఈ రెండు సంస్థలకు రూ.30 లక్షలు చొప్పున ఫైన్ వేసింది. పైలట్ల రోస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిరిండియా, స్పైస్ జెట్ సంస్థలకు డీజీసీఏ జరిమానా విధించింది.
కాగా, ఉత్తరాదిన పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబై ఎయిర్పోర్ట్లో దిగింది. అప్పటికే ఆలస్యమవడంతో కొందరు ప్రయాణికులు కిందకి దిగి, నేలపై కూర్చొని భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (The Ministry of Civil Aviation) ఇండిగో (IndiGo), ముంబై ఎయిర్ పోర్టు (Mumbai Airport)కు షోకాజ్ నోటీసులు (show-cause notices) కూడా జారీ చేసింది.
Also Read..
Pakistan | ఇరాన్పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు
CM Arvind Kejriwal | నేడు గోవాకు ఢిల్లీ సీఎం.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ గైర్హాజరు!
Indian Tectonic Plate | భారత భూగర్భంలో సంఘర్షణ.. పైకి పెరుగుతున్న హిమాలయాలు