న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అందుకు తగ్గట్టుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రోజూ లక్షల మంది టీకాలు వేయించుకుంటున్నారు. దాంతో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ 10 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు తొలి డోసులు, రెండో డోసులు కలిపి మొత్తం 10 కోట్లకుపైగా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఉదయం ఏడు గంటల వరకు గడిచిన 24 గంటల్లో వైద్యసిబ్బంది 35 లక్షల డోసుల టీకాలు ఇచ్చారని, వాటితో కలిపి మొత్తం 15,17,963 సెషన్లలో ఇచ్చిన టీకాల సంఖ్య 10,15,95,147కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
అది ఒక హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
72 గంటల్లో 12 మంది ఉగ్రవాదులు హతం..!
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు