శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులు గత రాత్రి జరిగిన కాల్పుల్లో టెరిటోరియల్ ఆర్మీ జవాన్ను చంపేశారని తెలిపారు.
కాగా, జమ్ముకశ్మీర్లో గత 72 గంటల్లో జరిగిన నాలుగు వేర్వేరు ఆపరేషన్లలో మొత్తం 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారని దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. వాళ్లలో త్రాల్, సోపియాన్ ఆపరేషన్లలో హతమైన ఏడుగురు, హరిపొరాలోని అల్ బదర్ ఆపరేషన్లో హతమైన ముగ్గురు, తాజాగా బిజ్బెహర్ ఆపరేషన్లో హతులైన ఇద్దరు ఉన్నారని ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
అది ఒక హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు