మోత్కూరు, మార్చి 30 : ఓ వివాహిత ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండటాన్ని తట్టుకోలేని భర్త బం ధువులతో కలిసి పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన సోమవారం రాత్రి మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని డాగ్ బంగ్లా ఏరియా లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం పట్టణ పరిధిలోని డాగ్ బంగ్లా ఏరియాలో ఉంటున్న ఓ వివాహిత రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద స్టాంపు వెండర్గా పని చేస్తున్న బయ్యని నర్సింహ్మతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలంగా భర్తకు దూ రంగా ఉంటున్నది. అయితే సోమవారం రాత్రి నర్సింహ్మతో కలిసి ఇంట్లో ఉండటాన్ని గమనించిన ఆమె భర్త, అతని బంధువులు వారికి రెడ్హ్యాండెడ్గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆమెతో పాటు సహకరించిన వివాహిత తల్లి, ప్రియుడు నర్సింహ్మను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి.ఉదయ్కిరణ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..