మస్కట్: ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగింది. ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఈ దాడిలో భారతీయుడైన మెరైన్ సిబ్బంది మరణించినట్లు ఒమన్ ధృవీకరించింది. (Indian crew member killed) ఆయిల్ ట్యాంకర్లోని మిగతా సిబ్బందిని రెస్క్యూ చేసినట్లు పేర్కొంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ధీటుగా స్పందిస్తున్నది. ప్రతిదాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో ఒమన్ సముద్ర జలాల్లో ఉన్న మార్షల్ దీవులకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ఎంకేడీ వియోమ్పై మార్చి1న డ్రోన్ దాడి జరిగింది. ప్రధాన ఇంజిన్ గదిలో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.
కాగా, ఆ ఆయిల్ ట్యాంకర్లో 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 16 మంది భారతీయులు, నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు ఉక్రేనియన్. అయితే డ్రోన్ బాంబు దాడి వల్ల జరిగిన పేలుడులో భారత్కు చెందిన ఒక మెరైన్ సిబ్బంది మరణించినట్లు ఒమన్ అధికారులు సోమవారం ధృవీకరించారు. మృతుడి వివరాలను వెల్లడించలేదు. ప్రాణాలతో బయటపడిన మిగతా వారిని పనామాకు చెందిన కార్గో షిష్లోకి తరలించినట్లు వివరించారు.
Also Read:
Iran Targets Netanyahu’s Office | ‘నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశాం’.. ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటన
Watch: ఎఫ్-15 ఫైటర్ జెట్ క్రాష్.. అమెరికా యుద్ధ విమానాలు కూలాయన్న కువైట్