కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో రాష్ట్రంలో తాజాగా పలు నియంత్రణ చర్యలను సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. గురువారం నుంచి లోకల్ ట్రైన్ సర్వీసులను నిలిపివేయడంతో పాటు మార్కెట్లు, షాపులు ఉదయం ఏడు నుంచి పదిగంటల వరకూ ఆపై సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకూ మాత్రమే పనిచేయాలని పేర్కొన్నారు. కోల్ కతా మెట్రో సహా వాహనాల్లో యాభై శాతం సీటింగ్ నే అనుమతిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను యాభై శాతం హాజరుతోనే నడిపిస్తారు. ఇక ప్రైవేట్ కార్యాలయాల్లో సగం మంది సిబ్బందికి ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక షాపింగ్ కాంప్లెక్స్లు, జిమ్ లు, సినిమాహాళ్లు, బ్యూటీ పార్లర్లను మూసివేయాలని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే విమాన ప్రయాణీకులను రాష్ట్రంలోకి అనుమతిస్తారు.