న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్లో ఆదివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇది 75వ మన్కీ బాత్ అని గుర్తుచేసిన ప్రధాని.. తమ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పునరుద్ఘాటించారు. కరోనాపై పోరులో మన దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం కొనసాగుతున్నదని ప్రధాని తెలిపారు. కరోనా టీకా వేసుకొనేందుకు ప్రజలంతా ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 109 ఏండ్ల రామ్ దులయ్యా, ఢిల్లీకి చెందిన 107 ఏండ్ల కేవల్ కృష్ణ, హైదరాబాద్కు చెందిన 100 ఏండ్ల జై చౌదరి కరోనా టీకాలు వేసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. క్రీడాకారిణులు మిథాలీరాజ్, పీవీ సింధు తదితరులు క్రీడల్లో గొప్పగా రాణిస్తున్నారని పేర్కొన్నారు.
ఇవీ కూడా చదవండి..
డెస్క్టాప్లోనూ వాట్సాప్ వీడియో/ వాయిస్ కాల్.. ఎలాగంటే!
అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం