India Corona | దేశంలో (India) కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ (Health Ministry Of India) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 59,512 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,641 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4.47 కోట్లకు (4,47,26,246) చేరింది.
మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 20 వేల మార్క్ను దాటింది. ప్రస్తుతం 20,219 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ (Corona Virus) నుంచి 4.41 కోట్ల మంది (4,41,75,135) కోలుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,892కి చేరింది.
ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతంగా, మరణాల రేటు 1.19శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 (220,66,12,500) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మరోవైపు కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు కొవిడ్-19 న్యూ వేరియంట్లను పసిగట్టేందుకు అన్ని పాజిటివ్ శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని సూచించింది.
Also Read..
Karnataka | షాకింగ్ ఘటన.. నవజాత శిశువును నోటితో ఈడ్చుకెళ్లిన వీధి కుక్క
Indore Temple | మెట్లబావి కూలిన ఘటన.. ఇండోర్ ఆలయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
Kerala | దారుణం.. తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్పోసి నిప్పంటించిన వ్యక్తి.. ముగ్గురు మృతి